టీటీడీలో నకిలీ టికెట్ల కలకలం

by M.Rajitha |
టీటీడీలో నకిలీ టికెట్ల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం తిరుమలలో నకిలీ స్పెషల్ దర్శనం టికెట్లు కలకలం రేపాయి. రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లతో లైన్లోకి వెళ్ళిన వారిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వైకుంఠం దగ్గర స్కానింగ్ చేసే వ్యక్తి సహాయంతో స్పెషల్ దర్శనం టికెట్లను కలర్ జిరాక్స్ తీయించి, వాటి సహాయంతో క్యూలైన్లోకి నలుగురు భక్తులు వెళ్లారు. అమృత్ రాజ్ అనే వ్యక్తి చెన్నై కి చెందిన భక్తులకు నాలుగు టికెట్స్ కు రూ.11 వేలు వసూలు చేసి, వాటిని స్కానింగ్ చేసే వ్యక్తితో పంచుకున్నాడు. నకిలీ టికెట్లను గుర్తించిన అధికారులు విజిలెన్స్ కు సమాచారం ఇవ్వగా ఆ భక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి, ఇంతక ముందు ఇలాంటి మోసాలకు ఏమైనా పాల్పడ్డార అనే విషయాలను వెలుగులోకి తెస్తామన్నారు.

Next Story

Most Viewed