Breaking: వైఎస్ షర్మిలకు నోటీసులు

by Disha Web Desk 16 |
Breaking: వైఎస్ షర్మిలకు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై ప్రస్తావించొద్దని కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్యపై వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఎన్నికల సంఘం వైఎస్ షర్మిలకు నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Next Story