- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > మిస్టరీ వీడిన ధవళేశ్వరం బాలికల కిడ్నాప్ కేసు... నిందితుడి అరెస్ట్
మిస్టరీ వీడిన ధవళేశ్వరం బాలికల కిడ్నాప్ కేసు... నిందితుడి అరెస్ట్

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇద్దరు బాలికను యువకుడు వెంకటేశ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు బాలికలను యువకుడు చెన్నై మీదుగా ఊటీ తీసుకెళ్లేందుకు యత్నించినట్లు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గుర్తించారు. నెల్లూరు పోలీసులు, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సాయంతో వెంటాడి పట్టుకున్నారు. విజయనగరం జిల్లా పెదమానాపురానికి చెందని వెంకటేశ్.. విలాసాలకు అలవాటు పడి కిడ్నాపులకు పాల్పడుతున్నారని నిర్ధారించారు. గతంలోనూ వెంకటేశ్ ఓ యువతిని పెళ్లి చేసుకుని వదిలేసినట్లు గుర్తించారు. నిందితుడు వెంకటేశ్ను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story