తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Disha Web Desk 16 |
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొవ్వూరు మండలం కాపవరంలో ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గల కారణామాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందజేశారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులను దృష్టి ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు రూల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని తెలిపారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.



Next Story