నారా భువనేశ్వరి చేతుల మీదుగా రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకు ప్రారంభం

by srinivas |
నారా భువనేశ్వరి చేతుల మీదుగా రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో సోమవారం బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో GSR ఫౌండర్ డా. రవి రామ్, టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ మూడు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుపతి, విశాఖతో పాటు హైదరాబాద్‌లో బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయన్నారు. తాజాగా రాజమండ్రిలో మరో బ్లడ్ బ్యాంకును నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకూ 8.1 మంది పేదలకు, తలసేమియా చిన్నారులకు ఉచితంగా రక్తం అందించామని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story