- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్ కాకినాడ రూరల్ షెడ్యూల్ ఇదే...!
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: కాకినాడ రూరల్లో సీఎం జగన్ శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17 రోజులు పూర్తి చేసుకుంది. 18వ రోజు కాకినాడ రూరల్లో మేమంతా సిద్ధం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎస్టీ రాజపురంలో ఇవాళ రాత్రి బస చేస్తున్నారని, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆ ప్రాంతం నుంచే మేమంతా సిద్ధం కార్యక్రమానికి బయలుదేరుతారని తెలిపారు. ‘రంగంపేట,పెద్దాపురం బైపాస్,సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.’ అని తలశిల రఘురాం తెలిపారు.