AP:‘డ్రోన్‌లతో ఆహారం అందజేత’..డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ ట్వీట్!

by Jakkula Mamatha |
AP:‘డ్రోన్‌లతో ఆహారం అందజేత’..డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీవర్షాలు(Heavy Rains) విజయవాడను వరదలతో ముంచెత్తాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను(Flood victims) ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్(Drone) సహాయంతో వరద బాధితులకు ఆహారాన్ని(Food) అందిస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ‘డ్రోన్ల ద్వారా వరద బాధితుల బాధలను ఎలా తగ్గించవచ్చో ఈ ఫోటో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే సీఎం చంద్రబాబును మనం అభినందించాలి. ‘మీ నుంచి చాలా నేర్చుకోవాలి సర్’ అని పవన్ కళ్యాణ్ ఎక్స్(X) లో పేర్కొన్నారు. APలో మీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అందరికీ స్ఫూర్తినిస్తుంది’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed