- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
AP News:ప్రభుత్వ రికార్డుల దహనం పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్
![AP News:ప్రభుత్వ రికార్డుల దహనం పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ AP News:ప్రభుత్వ రికార్డుల దహనం పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348817-untitled-1.webp)
దిశ,వెబ్డెస్క్:విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ , కారు డ్రైవర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దహనంపై ఆరా తీశారు. దగ్ధమైన ఫైల్స్, రికార్డుల వివరాలను వెంటనే అందించాలని అధికారులను పవన్ ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు బాధ్యులు అయినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పీసీబీ ఆఫీసుల్లో భద్రతకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడించాలని పవన్ పేర్కొన్నారు.