లడ్డు ఇష్యూపై సారీ చెప్పిన హీరో.. అభినందించిన డిప్యూటీ సీఎం

by Mahesh |
లడ్డు ఇష్యూపై సారీ చెప్పిన హీరో.. అభినందించిన డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రస్తుతం తిరుపతి లడ్డు అపవిత్రం పై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో హీరో కార్తీ తన సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో హీరో కార్తీ వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. నటుడు కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌లో.. "వెంటనే మీరు స్పందించిన విధానం నచ్చింది. సనాతన ధర్మంపై మీకు ఉన్న గౌరవం నాకు తెలుసు. తిరుమల లడ్డూ కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఇష్యూ. ఇలాంటి విషయాల్లో మాట్లాడే ముందు అందరం జాగ్రత్తగా ఉండాలి. కార్తీ కావాలని అనలేదని నాకు తెలుసని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story

Most Viewed