- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు’.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు షాకింగ్ స్టేట్మెంట్
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల్లో పోటీ చేయకపోవడం నా అదృష్టమని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు(Daggubati Venkateswara Rao) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై స్పందించారు. రూ.30 కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిస్తే.. గెలిచాక మరో రూ.40 కోట్లు ఖర్చుపెట్టాలని అన్నారు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయంగా ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిగతా లైఫ్ మొత్తం పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తా అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
రాజకీయాల నుంచి సంతోషంగా రిటైర్ అయ్యాననే భావన ఇప్పుడు తనకు కలుగుతోందని అన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా వచ్చేవి.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. పోటీ పెరిగిపోవడంతో ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 1985 నాటి కాలంలో ఉద్యోగాలు ఈజీగా వచ్చేవని అన్నారు. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురందేశ్వరి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.