Breaking: నల్లా నీళ్లు తాగారు.. కాసేటికే పేషెంట్లుగా మారిన 20 మంది

by Disha Web Desk 16 |
Breaking: నల్లా నీళ్లు తాగారు.. కాసేటికే పేషెంట్లుగా మారిన 20 మంది
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండల నెలగొండలో కలుషిత నీరు కలకలం రేగింది. నీళ్లు తాగిన జనాలకు వాంతులు, విరేచనాలు పట్టుకున్నారు. దీంతో గ్రామంలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో కలుషిత నీరు రావడానికి కారణాలు ఏంటనే దానిపై ఆరా తీశారు. మున్సిపల్ అధికారులకు సమాచారం అందజేశారు. గ్రామంలో స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బాధితులు చాలా వరకూ కోలుకున్నారని స్థానిక నాయకులు తెలిపారు.

Next Story

Most Viewed