కుప్పంలో ఎవరైనా ఆ పని చేస్తే.. వాళ్లకి అదే చివరి రోజు: చంద్రబాబు మాస్ వార్నింగ్

by Satheesh |   ( Updated:2024-06-25 12:26:03.0  )
కుప్పంలో ఎవరైనా ఆ పని చేస్తే.. వాళ్లకి అదే చివరి రోజు: చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతానని టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజలు రుణం తీర్చుకుంటానని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచానని, కుప్పం ప్రజలు ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచారని భావోద్వేగానికి గురి అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాబు ఫస్ట్ టైమ్ ఇవాళ తన సొంత ఇలాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలు ఎంతో చారిత్రాత్మకమని.. ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించామని అన్నారు. చిత్తూరు లోక్ సభ పరిధిలో మొత్తం స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. కేబినెట్‌లో కొత్తవారికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చామని చెప్పారు.

మంత్రి మండలిలో 8 మంది బీసీలకు చోటు కల్పించామన్నారు. వైసీపీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని, అధికారం ఉందని విర్రవీగితే ఇదే గతి పడుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. నియంత పాలన చేసిన వైసీపీని ఇంటికి పంపడానికి మూడు పార్టీలు కలిసిపోరాడాయని.. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన ఒక పీడ కల అని, ఆ పార్టీ నేతలు చేయని దౌర్జన్యాలు లేవని ఫైర్ అయ్యారు. చివరకు తన మీదకు కూడా వైసీపీ నేతలు వచ్చారని ఫైర్ అయ్యారు. కుప్పంలో కేజీఎఫ్‌ను మరిపించేలా దోపిడి జరిగిందని మండిపడ్డారు. ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేస్తే.. అదే వారికి చివరి రోజు అవుతోందని హెచ్చరించారు.

Advertisement

Next Story