CM Chandrababu: తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బాధ్యత మనదే

by Anjali |   ( Updated:2024-08-29 04:27:19.0  )
CM Chandrababu: తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బాధ్యత మనదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహద్ బాధ్యత మనం తీసుకుందాం. అదే వారికి మనమిచ్చే ఘననివాళి. తెలుగు వెలగాలి...తెలుగు భాష వర్థిల్లాలి అని కోరుకుంటూ దాని కోసం పనిచేద్దాం. అని సోషల్ మీడియా వేదికన ఏపీ సీఎం తెలుగు ప్రజలకు తెలుగు భాషా శుభాకాంక్షు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed