- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ap News: సీఎం చంద్రబాబు ఆందోళన.. వారిపై చర్యలకు ఆదేశం
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ(Free Sand Policy)ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే అధిక ధరలున్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు. ఇసుక దరఖాస్తు ఫీజు కంటే మరింత డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టపై దుష్ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ అధికారుల(Mines Department Officials)ను ఆదేశించారు. ఉద్దేకపూర్వక దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారిని కట్టడి చేయాలని సూచించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Advertisement
Next Story