CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వం సీరియస్.. విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

by Shiva |   ( Updated:2024-08-30 05:54:03.0  )
CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వం సీరియస్.. విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అర్ధరాత్రి ఆలజడి రేగింది. లేడీస్ హాస్టల్‌లోని వాష్‌రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులంతా ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి విజయ్ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడితో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై తక్షణమే విచారణ జరపాలని పోలీసు ఉన్నధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed