తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి

by Mamatha |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం పౌర సంబంధాల, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆలయం నుంచి బయటికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ..జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు.

Next Story

Most Viewed