AP News:రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,తిరుమల:ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..ఎక్కడ చూసిన రేప్, మర్డర్లు, బాత్ రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే? అంటూ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. దిశ యాప్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం నిందితులను పట్టుకుని 24 గంటల్లో శిక్షించారని గుర్తు చేశారు. జగన్ అన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదని స్పష్టం చేశారు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేశారని, ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకు రాలేక పోతున్నారని ఆరోపించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం, హోమ్ మంత్రి ఎందుకు వెళ్లలేదో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

మదనపల్లెలో ఫైల్ దగ్ధం కేసు పై స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి విచారణ చేపట్టారని, ఆడపిల్లకు అన్యాయం జరిగితే శ్రద్ధ చూపడం లేదు ఎందుకని ప్రశ్నించారు. హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు చెప్తుంటే అలాంటిది ఏమీ లేదని ఎస్పీ చెప్పడం సిగ్గు చేటన్నారు. న్యాయం కావాలని 300 మంది విద్యార్థినులు ధర్నాకు దిగితే కంటి తుడుపు చర్యగా విచారణ చేపడతామని అధికార యంత్రాంగం దిగి రావడం సూచనీయమన్నారు. నూతన ప్రభుత్వంలో ర్యాగింగ్ భూతం పేట్రేగిపోతుందని తెలిపిన రోజా నారాయణ కాలేజీలో ర్యాగింగ్ చేసి మెడికల్ విద్యార్థినిని చంపేశారన్నారు. కలికిరి జేఎన్టీయూ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గత ఐదేళ్లలో లేని ర్యాగింగ్ భూతం ఇప్పుడు మళ్లీ తాండవం చేస్తోందని విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పై పెట్టిన శ్రద్ధ ఆడపిల్లలు, మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టాలని కోరారు. 2014-19లో కూడా ఇలానే చాలా మంది మారారని వెళ్లే వారి వల్ల పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు. పార్టీలు మారే వారికి గౌరవం దక్కదని చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు.

Advertisement

Next Story

Most Viewed