చిత్తూరులో వైసీపీకి బిగ్ షాక్... టీడీపీలో చేరిన మేయర్, 20 మంది కార్పొరేటర్లు

by srinivas |   ( Updated:2024-07-05 10:48:17.0  )
చిత్తూరులో వైసీపీకి బిగ్ షాక్... టీడీపీలో చేరిన మేయర్, 20 మంది కార్పొరేటర్లు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మేయర్‌ ఆముదతోపాటు 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జగన్మోహన్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేషన్‌లో జరిగిన ఎలక్షన్స్‌లో 46 వైసీపీ, మూడు టీడీపీ, ఒకఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో వైసీపీకి భారీ మెజార్టీ ఉండటంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఆముదను మేయర్ ఎన్నుకున్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ కార్పొరేటర్లు గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మేయర్ ఆముదతో పాటు 20 మంది కార్పొరేటర్లు సైకిల్ గూటికి చేరారు. దీంతో టీడీపీ బలం 23కు చేరింది. మరికొంతమంది కార్పొరేటర్లు సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. చిత్తూరు కార్పొరేషన్‌పై కన్నేసిన టీడీపీ.. మరికొద్ది రోజుల్లో జెండా ఎగురవేసేలా ప్రయత్నం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story