ఛీ వీడు మనిషేనా.. మద్యానికి బానిసై మతిస్థిమితం లేని కన్న కూతురిపై అత్యాచారం

by Kavitha |   ( Updated:2024-08-26 14:50:49.0  )
ఛీ వీడు మనిషేనా.. మద్యానికి బానిసై మతిస్థిమితం లేని కన్న కూతురిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా భయం భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్న, తమ్ముడు, తండ్రి అనే వావివరసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఎన్నో చట్టాలు న్యాయాలు ఉన్నా వారిని ఏం చేయలేకపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలనాగై కాటేశాడు. మద్యానికి బానిసై మృగంలా మతిస్థిమితం లేని ఈ బాలికపై విరుచుకుపడ్డాడు. కాగా ఈ దారుణం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా బయట పడింది. వివరాల్లోకి వెళితే..

ఆ గ్రామానికి చెందిన వ్యక్తికి ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. మేనరికం కావడంతో పిల్లలు ముగ్గురూ మానసిక వైకల్యంతో జన్మించారు. వీరి పోషణ, ఆలన, పాలన చూడటం కష్టం సాధ్యంగా మారింది. మరోవైపు ఇంటి పెద్దదిక్కుగా ఉండే తండ్రి మద్యానికి బానిసవ్వడం ఆ కుటుంబానికి మరింత భారమైంది. దీంతో చిన్నమ్మాయిని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో చేర్పించారు. అక్కడ చిన్నారి చదువుతోంది. ఇక ప్రభుత్వం ఇస్తున్న వికలాంగ పింఛను తీసుకునేందుకు ప్రతినెలా ఆ బాలికను ఆమె తల్లి ఇంటికి తీసుకొచ్చేది. మద్యానికి బానిసైన కన్న తండ్రి ఆ చిన్నారిపై కన్న కూతురని కూడా చూడకుండా మతిస్థిమితం లేని ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

కొన్ని నెలలుగా తన వికృత చేష్టలతో ఆ చిన్నారిని లైంగికంగా వేధించాడు. ఈనెల మొదటి వారంలో ఇంటికి వచ్చిన కుమార్తెతో తన పశువాంఛను తీర్చుకున్నాడు. అడ్డుపడిన భార్యపై దాడి చేసి చంపుతానని బెదిరించాడు. కానీ దుర్మార్గుడి ఆగడాలను భరించలేక భార్య, తన కుమార్తెతో కలిసి శనివారం సాయంత్రం అనంతపురం దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story