కడప జిల్లా రాజంపేటపై చంద్రబాబు వరాల జల్లు

by Disha Web Desk 16 |
కడప జిల్లా రాజంపేటపై చంద్రబాబు వరాల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా రాజంపేటపై టీడీపీ అధినేత చంద్రబాబు వరాలు కురిపించారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని చెప్పారు. అంతేకాదు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి అన్యాయం చేయమని చెప్పారు. ప్రజాభిప్రాయంతోనే పాలన అందిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను అండగా ఉంటామని చెప్పారు. గాలేరు-నగరి కాలవను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.



Next Story

Most Viewed