ఏపీలో వరద నష్టంపై కేబినెట్ సబ్ కమిటీ

by M.Rajitha |
ఏపీలో వరద నష్టంపై కేబినెట్ సబ్ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వరదల వల్ల కలిగిన నష్టం, నష్టపోయిన వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఈ కమిటీ అంచనా వేయనుంది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగురు నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ ఉండగా.. ఈ కమిటీకి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వ్యవహరించనున్నారు. ఏ స్థాయిలో ఎంతెంత నష్టపరిహారం చెల్లించాలి అనే విషయంపై విధివిధానాలను, వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ అంచనా వేయనుంది.

Advertisement

Next Story

Most Viewed