పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత

by Sridhar Babu |
పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత
X

దిశ, భద్రాచలం : రాజస్థాన్ కి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఖమ్మం ఎన్​ఫోర్స్​మెంట్ బృందం వాహన తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా నుంచి రాజస్థాన్ కి కారులో ముఖేష్ మిర్ద, గుజ్జర్ శ్రీరామ అనే వ్యక్తులు 45.170 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​ సీహెచ్. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, హనుమంతరావు, వెంకట్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story