HYD: బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతల క్యూ...ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి భారీగా చేరికలు

by srinivas |
HYD: బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతల క్యూ...ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి భారీగా చేరికలు
X

దిశ, ఏపీ బ్యూరో: విభజన హామీల సాధన బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్​ఏపీ క్యాంప్ కార్యాలయంలో యర్రగొండపాలెం, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన దూపాటి చంద్రబాబు, డాక్టర్ వెస్లీ సహా పలు జిల్లాలకు చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడి పోయిందన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం సహా విభజన హామీల సాధనలో ఘోరంగా విఫలమయ్యాయన్ని దుయ్యబట్టారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలు సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మెప్పు కోసం సీఎం జగన్, చంద్రబాబు లిద్దరు వంగి వంగి దండాలు పెడుతూ వారి పబ్బం గడుపు కుంటున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీని ఎదిరించగల ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ తెలంగాణ మోడల్ అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ, వైసీపీలకు బీఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. రానున్న కాలంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed