BREAKING: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు

by Shiva |
BREAKING: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను జూలై 16 వరకు అరెస్ట్ చేయకూడదని, వారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసులో తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. అయితే, తాజాగా ఆ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, కేసులో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం, అంబేద్కర్‎‌తో సహా మరికొందరిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



Next Story

Most Viewed