సీఎం జగన్‌కు బిగ్ షాక్: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని వార్నింగ్

by Seetharam |
సీఎం జగన్‌కు బిగ్ షాక్: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఎన్నికల వేళ ఎంతో జోష్‌తో మరోసారి ఎన్నికలు సమాయత్తం కావాల్సిన తరుణంలో సమ్మెలు, ఆందోళనలు, నిరసనలుప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతా ఒకేసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండటంతో వైసీపీ ప్రభుత్వానికి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఇప్పటికే పలు దఫాలుగా మంత్రుల బృందం చర్చలు జరిపినప్పటికీ అంగన్వాడీలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఆశావర్కర్లు, సర్వశిక్షాఅభియాన్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వంపై పోరాటానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో అంతా ఆందోళన బాట పడుతున్నారు. అంగన్వాడీలు అయితే ఏకంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సేవల నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు బిగ్ షాక్ ఇచ్చాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించాలని...లేని పక్షంలో ఈనెల 29 నుంచి ఆరోగ్య శ్రీ క్రింద రోగులను చేర్చుకోబోమని హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవల నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. డిసెంబర్ 15 లోగా అని సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆస్పత్రుల యాజమాన్యాలకు గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి దాన్ని అమలు పరచలేదని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని భావించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.1000కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పలు శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed