తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ వరద సహాయం

by M.Rajitha |
తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ వరద సహాయం
X

దిశ, వెబ్ డెస్క్ : మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు భారీగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తెలుగు ప్రజలతో మా కుటుంబానికి ఉన్న బంధం విడదీయరానిది, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. మీరు నా బాధ్యత.. అందుకు గాను ఇరు రాష్ట్రాల ప్రజలకు నా వంతుగా చెరో రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు.

Next Story

Most Viewed