బ్రాహ్మణులు, పండితులు సారీ చెప్పాలి: జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య సంచలన డిమాండ్

by srinivas |
బ్రాహ్మణులు, పండితులు సారీ చెప్పాలి: జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయిన విషయం తెలిసిందే. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని ఏపీ ప్రభుత్వం(AP Government)కు సూచించిన నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి(Astrologer Venu Swami Wife Veena Srivani) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేశారు. ‘పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. భక్తుల మనోభావాలను హింసించేశారు. రాజకీయ నాయకులను పక్కన పెడితే... ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు, చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు. ప్రాయశ్చిత శ్లోకాలు కనిపెట్టి మరీ రచ్చ చేశారు. వందల వేల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నిజమైన హిందువులైతే, వెంకటేశ్వరస్వామి భక్తులైతే క్షమాపణలు చెప్పాలి.’’ అని వీణా శ్రీవాణి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed