సీఎం సహాయనిధికి రూ.24 లక్షలు అందజేసిన ఏపీ హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్

by Mahesh |
సీఎం సహాయనిధికి రూ.24 లక్షలు అందజేసిన ఏపీ హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రూ.24 లక్షలను అందజేశారు. చెక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అందజేశారు. వరద బాధితులకు సహాయం కోసం మరింత మంది ముందుకొచ్చి సహాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed