పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

by srinivas |
పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్.. నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించలేదని దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. పెద్దరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పెద్దిరెడ్డితో పాటు పుంగనూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 9కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed