ఆ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..!

by srinivas |
ఆ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్..   మూడు రోజుల షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాకు వెళ్తున్నారు. జులై 1 నుంచి 3వ తారీకు వరకూ ఆయన ఆ జిల్లాలోనే పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ జులై 1న కాకినాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి అదే రోజు గొల్లప్రోలులో పింఛన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మొత్తం రూ. 7 వేలు పెన్షన్‌ను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రారంభించి పరిశీలించనున్నారు. అనంతరం పిఠాపురంలో పర్యటిస్తారు. అక్కడి జనసేన నేతలతో భేటీ అవుతారు. నియోజవకర్గం సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు.

2న కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పవన్ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక సూచనలు చేయనున్నారు. అదే రోజు అక్కడే బస చేసి జులై 3న ఉప్పాడకు వెళ్లనున్నారు. ఉప్పాడ బీచ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భద్రత విషయంలోనూ వెనక్కి తగ్గొద్దని చెప్పనున్నారు. బీచ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించే అవకాశాలున్నాయని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. పవన్ పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed