- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏపీ జవాన్ల మృతిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్
![ఏపీ జవాన్ల మృతిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ ఏపీ జవాన్ల మృతిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్](https://www.dishadaily.com/h-upload/2024/06/12/342494-chandrababu.webp)
దిశ, వెబ్డెస్క్: సైనిక విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్ నది దాటిస్తుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు జవాన్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికులు వీరమరణం పొందడం పట్ల టీడీపీ చీఫ్, ఏసీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. లద్దాఖ్లో యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు ఏపీ జవాన్ల మృతి కలిసివేసిందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉంటే, శనివారం లడఖ్లో మృతి చెందిన ముగ్గురు జవాన్ల మృతదేహాలు స్వరాష్ట్రానికి చేరుకున్నాయి. గ్వాలియర్ నుండి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో అధికారులు డెడ్ బాడీలను విజయవాడకు తరలించారు.