AP: చంద్రబాబును ఈసారి కుప్పంలో ఓడించి తీరుతాం: మంత్రి పెద్దిరెడ్డి సంచలన సవాల్

by Disha Web Desk 1 |
AP: చంద్రబాబును ఈసారి కుప్పంలో ఓడించి తీరుతాం: మంత్రి పెద్దిరెడ్డి సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును ఈసారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించి తీరుతామని మంత్ర పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన సవాల్ చేశారు. ఇవాళ కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భరత్ నామినేషన్ కార్యక్రమంలో బయటి రాష్ట్రాల వ్యక్తులు పాల్గొన్నట్లుగా నిరూపిస్తే.. తమ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుంటాడని పెద్దిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అనవస ఆరపణలు మానుకోవాలని హితవు పలికారు.

తనపై, తమ పార్టీ అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేస్తే బాగోదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని అన్నారు. చంద్రబాబు ఎలాగైనా ఓడిపోతాడనే భయంతో తనపై వ్యక్తిగత ఆరోపణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు. ఆ విషయం ప్రజలకు కూడా గమనించారని అన్నారు. కుప్పం నుంచి భరత్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed