జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. మిత్తితో సహా చెల్లిస్తాం: CM జగన్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. మిత్తితో సహా చెల్లిస్తాం: CM జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోరుకొండలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ పెద్దలతో కలిసి టీడీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకున్నారని, పథకాలను ఆపగలరు కానీ మా విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరని సీఎం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని, పవర్‌లోకి వచ్చిన వెంటనే మిత్తితో సహా మొత్తం చెల్లిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి రాష్ట్రంలో పేదవాళ్లు, పెత్తందార్లు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఓటు వేసే ముందు ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడండని, ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండని సూచించారు. కాగా, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

Read More..

పవన్ కోసం రంగంలోకి చిరంజీవి.. పిఠాపురం ప్రజలకు కీలక విజ్ఞప్తి

Next Story

Most Viewed