విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం.. కొత్త చైర్మన్‌ నియామకం

by Gantepaka Srikanth |
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం.. కొత్త చైర్మన్‌ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ చైర్మన్‌గా అజిత్ కుమార్ సక్సేనా(Ajith Kumar Saxena)ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అజిత్ కుమార్ సక్సేనా ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. మాంగనీస్ లిమిటెడ్ సీఎండీగా బదిలీపై వెళ్లి.. మళ్లీ స్టీల్ ప్లాంట్ చైర్మన్‌గా అజిత్ కుమార్ తిరిగి రావడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయి చైర్మన్‌ను నియమించే వరకు సక్సేనా కొనసాగుతారని ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Next Story