సిద్ధం సభలో ఎంపీ పై ఫైర్ అయిన ఆదిరెడ్డి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-05 14:40:40.0  )
సిద్ధం సభలో ఎంపీ పై ఫైర్ అయిన ఆదిరెడ్డి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ,రాజమహేంద్రవరం: సిద్ధం సభలో ఎంపీ భరత్ చెప్పు చూపించి ఆదిరెడ్డి అప్పారావు ను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యల పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, రాజమండ్రి సిటీ జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణ(అనుశ్రీ) ఫైరయ్యారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టెన్షన్ లో పడి ఎంపి భరత్ ఏమీ మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. నీకు సంస్కారం వుందా అని భరత్ ను ప్రశ్నించారు. రాజమండ్రి సిటీ లో ఎంపీ గా గత ఎన్నికలలో నీకు 28వేలు టీడీపీ అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అనేది నీకు గుర్తుందా? ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నించారు. అంతా వద్దంటే వేసిన సెంట్రల్ లైటింగ్ ను ఇప్పుడు తీసేస్తాను అంటున్నావు, మరి ఆ ఖర్చు దుర్వినియోగం కాదా! నీది ఫెయిల్యూర్ సినిమా అని, నువ్వు ఒక సినిమాలో నటిస్తే రెండో రోజే ఆగిపోయిందన్నారు.

జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ,వాలంటీర్స్ కి మేము వ్యతిరేకం కాదన్నారు.ఏడు నియోజకవర్గాల ఎంపీ, రాజమండ్రి సిటీ కా అని ప్రశ్నించారు.బలుపుతో నీ తండ్రి వయసున్న ఆదిరెడ్డి అప్పారావు ను సభలో చెప్పు చూపించి కొడతానని బెదిరిస్తావా, రౌడీయిజం చేస్తున్నావా అంటూ ధ్వజమెత్తారు. రౌడీ గా వ్యవహరిస్తే బెల్ట్ దెబ్బలు పడతాయన్నారు. ఎంపీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ప్రజలకు తెలియడం లేదన్నారు.చెల్లెల్లు గా వాలంటీర్లను చూసుకుంటా అంటే సంతోషమే కానీ , మీకు వచ్చిన ఆదాయం కూడా వారికి పంచండి అంటూ సవాల్ విసిరారు.

Read More..

ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేసేది నేనే.. పరిటాల శ్రీరామ్

Advertisement

Next Story

Most Viewed

    null