- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Adani Group : సీఎం రిలీఫ్ ఫండ్కు 25 కోట్లు విరాళం ప్రకటించిన అదానీ గ్రూప్
దిశ, వెబ్డెస్క్: ఈ నెల మొదటి వారంలో ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో విజయవాడలోని పదుల సంఖ్యలో కాలనీలు నీట మునిగిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు వరద బాధితులు గా మిగిలిపోయారు. విజయవాడ తో పాటు పలు జిల్లాల్లో కూడా భారీగా వరదలు సంభవించాయి. దీంతో రాష్ట్రానికి, వరద బాధితులకు అండగా ఉండేందుకు ప్రముఖులు, ఉద్యోగులు, సంఘాలు, కంపేనీలు సీఎం సహాయనిధికి (CMRF)కి విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అధానీ గ్రూప్ (Adani Group) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ (Adani Foundation) ద్వారా.. విరాళం అందజేసిన అదానీ గ్రూప్ .. ట్విట్టర్ వేదికగా రూ. 25 కోట్ల విరాళం అందించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. ఈ మేరకు రూ. 25 కోట్ల విరాళానికి సంబంధించిన పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అందిస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.