Breaking: బైక్‌పై వెళ్తూ రోడ్డు గుంతలో పడి యువకుడు మృతి

by srinivas |
Breaking: బైక్‌పై వెళ్తూ  రోడ్డు గుంతలో పడి యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడిలో విషాదం చోటు చేసుకుంది. వెంప గ్రామానికి చెందిన యువకుడు సతీశ్ బైక్ పై వెళ్తూ రోడ్డు గుంతలో పడ్డారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సతీశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే రోడ్లు సరిగా లేకపోవడంతోనే సతీశ్ మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం కనీసం రోడ్ల గుంతలను పూడ్చలేదని ఆరోపించారు. బేతపూడిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, కూటమి ప్రభుత్వమైనా సరి చేయలేయని కోరుతున్నారు. సతీశ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు



Next Story