నా భార్య-బిడ్డలను ఆ వీడియోలతో హింసించారు..కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
నా భార్య-బిడ్డలను ఆ వీడియోలతో హింసించారు..కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఓకే సారి జరిగాయి. ఎన్నికల పోలింగ్ రోజు పలు చోట్ల అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలపై దాడులు జరిగాయని, అసభ్యకర పదజాలంతో దూషించారని టీడీపీ శ్రేణులు తెలిపారు. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయి ఎన్నో దాడులకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే వాపోయారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారని వాపోయారు. తన భార్య, బిడ్డలకు అసభ్యకరమైన వీడియోలు పంపించారని, గంట గంటకు రకరకాల వీడియోలు పెడుతూ హింసించారని మండిపడ్డారు. అవి తట్టుకోలేక తన భార్య, బిడ్డలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారని చెప్పారు. రాత్రిళ్లు తన కుటుంబం ఏడ్చిన రోజులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story