ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్

by Disha Web Desk 16 |
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబారుపేటలో రోడ్డు దాటుతున్న మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం, మృతుల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంతో రోడ్డుపై జామ్ అయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు రూల్స్ ఫాలో కావాలని పోలీసులు సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని తెలిపారు. మద్యం తాగి అసలు వాహనాలు నడపొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story

Most Viewed