వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి చేరిన వైసీపీ ప్రముఖ నేత..

by Indraja |
వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి చేరిన వైసీపీ ప్రముఖ నేత..
X

దిశ వెబ్ డెస్క్: మాజీ కేంద్ర మంత్రి కిళ్ళి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆమె నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కృపారాణికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన తనని సీఎం జగన్ పక్కన పెట్టారని.. తన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు దేవుడని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడుమళ్ళీ వైఎస్ షర్మిల లో చూస్తున్నామని పేర్కొన్నారు. కాగా షర్మిలమ్మ న్యాయకత్వం లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఒక నియంత అని ఈ నియంత ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిలమ్మని కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు గెలిపించుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed