ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో రేపటి నుంచి మరో కొత్త కార్యక్రమం

by Jakkula Mamatha |
ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో రేపటి నుంచి మరో కొత్త కార్యక్రమం
X

దిశ,వెబ్‌డెస్క్: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఇవి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’’. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం ఇది. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని.. దీనికి సంబంధించిన లోగోని షేర్ చేస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed