Vizag: బోటులో అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది

by Mahesh |
Vizag: బోటులో అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ‌పట్టణం(Visakhapatnam)లోని నడి సముద్రంలో అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సముద్ర మార్గం గుండా వెళ్తున్న ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బోటులో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు కారణంగా నడి సముద్రంలో కాలుతున్న బోటులో 8 మంది సిబ్బంది చిక్కుకున్నారు. కాగా మంటలను గమనించిన సిబ్బంది సమీపంలో ఉన్న బోట్లకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇతర బోట్ల సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లిన బోటులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story