జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నటుడు

by Seetharam |
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నటుడు
X

దిశ , డైనమిక్ బ్యూరో : ప్రముఖ సినీనటుడు సాగర్ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన సాగర్‌కి జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ... జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతోంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో తాము ముందుకు వెళ్తామని సినీనటుడు సాగర్ వెల్లడించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ క ళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలు వర్గాలు పార్టీలో చేరాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ కార్యాలయంలో సినీనటుడు సాగర్‌తోపాటు మరికొందరు చేరారు. హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లక్కినేని సురేందర్ రావు, అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా అంతా కలిసి పనిచేయాలని పవన్ కల్యాణ్ నాయకులను ఆదేశించారు.

Advertisement

Next Story