78 Independence Day: విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

by srinivas |
78 Independence Day: విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: 78 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. విజయవాడలో జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్లో మంత్రులతో పాటు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇక దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి ‘జన గణ మన’ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. దేశ సమైక్యతను చాటుతున్నారు.

Next Story

Most Viewed