నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 30కి పైగా కంపెనీల్లో 6న ఇంటర్వ్యూలు

by srinivas |
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 30కి పైగా కంపెనీల్లో 6న ఇంటర్వ్యూలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న గుంటూరు జిల్లా నిరుద్యోగుల(Guntur District Un Employees)కు ప్రైవేటు కంపెనీలు గుడ్ న్యూస్ తెలిపాయి. గుంటూరు సిటీలో 30కి పైగా ప్రైవేటు కంపెనీలు జాబ్ మేళా(Job fair) నిర్వహిస్తున్నాయి. ఈ నెల 6న (ఆదివారం) గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌(Guntur Patibandla Sitaramaiah High School)లో జాబ్ ఫేర్ ఏర్పాటు చేశాయి. నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నాలని నిర్వాహకులు తెలిపారు. టెన్త్ పాస్, ఫెయిల్ అయిన వాళ్ల సైతం ఈ ఫెయిర్‌లో పాల్గొనవచ్చన్నారు. టెన్త్, ఇంటర్, పీజీ, ఫార్మా వంటి అర్హతలు కలిగిన నిరుద్యోగులకు ఈ మేళాలో ఉద్యోగవకాశాలు లభిస్తాయని తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు తమ పేరును రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


Next Story