School Bus: స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది చిన్నారులు మృతి

బ్యాంకాక్ లో స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎంతమంది మరణించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Update: 2024-10-01 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్: స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘోర విషాద ఘటన థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగింది. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా.. ఉతయ్ థాని ప్రావిన్స్ వద్ద స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అక్కడి ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ సూరియ మీడియాకు వెల్లడించారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ఉండగా.. 25 మంది మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇంకా ఎంతమంది చనిపోయారో, ఎంతమందికి గాయాలు అయ్యాయన్న విషయాలపై స్పష్టత రాలేదు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా.. మృతదేహాలు బస్సులోనే కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి సూరియ తెలిపారు. కాగా.. బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Similar News