పుత్రశోకం : తల్లి ఎదుటే బాలుడిని కబళించిన టిప్పర్

దిశ, పెద్దపల్లి : తల్లి ఎదుటే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన సలిగంటి సిద్ధార్థ్ (11) అనే బాలుడి పైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సలిగంటి సీతారాములు, దివ్య దంపతుల పెద్ద కుమారుడు సిద్ధార్థ్.. కుటుంబ సభ్యులతో కలిసి వార సంతకు వెళ్లే క్రమంలో సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్‌కు […]

Update: 2021-06-22 05:43 GMT

దిశ, పెద్దపల్లి : తల్లి ఎదుటే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన సలిగంటి సిద్ధార్థ్ (11) అనే బాలుడి పైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సలిగంటి సీతారాములు, దివ్య దంపతుల పెద్ద కుమారుడు సిద్ధార్థ్.. కుటుంబ సభ్యులతో కలిసి వార సంతకు వెళ్లే క్రమంలో సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్‌కు వెళ్తున్న టిఎస్ యూబీ 7680 గల టిప్పర్ లారీ బాలుడు రోడ్డు దాటుతుండగా పైకి దూసుకెళ్లింది.

దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ఘటనా స్థలికి సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేరుకొని బాలుడు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో బాలుడి కడపు మొత్తం చీలిపోయింది. కళ్లెదుటే కుమారుడు మరణాన్ని చూసిన తల్లి గుండెలదిరేలా రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.

Tags:    

Similar News