కౌంట్‌డౌన్ స్టార్ట్ బిగిలు అంటున్న మెగా హీరో.. హైప్ క్రియేట్ చేస్తున్న పోస్ట్

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వలో వస్తున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

Update: 2024-10-21 06:09 GMT

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వలో వస్తున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇక పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1958 నుంచి 1982 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ మూవీలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా జి. వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. నవంబర్14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుగా రానున్నది. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా వరుణ్ తేజ్ ఇన్‌స్టా వేదికగా ఆదివారం ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘మట్కా’ సినిమా రిలీజ్‌‌కు 25రోజులు ఉందనేలా కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.



Similar News