నేటి త‌రానికి దేశ‌భ‌క్తిని అలవాటు చేయాలిః రుద్ర ఫౌండేషన్ చైర్మన్

Update: 2024-08-15 15:38 GMT

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : నేటి త‌రానికి దేశ‌భ‌క్తిని అలవాటు చేయాలని ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త‌, రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా గురువారం హ‌న్మ‌కొండ‌లోని 54వ డివిజన్ పెగడపల్లి డబ్బాల వద్ద జాతీయ జెండాను గోపికృష్ణ ఆవిష్క‌రంచారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ‌భ‌క్తిని చిన్న‌త‌నం నుంచే పిల్ల‌ల‌కు అల‌వాటు చేయాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల‌పై ఉంద‌న్నారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కార్యక్రమంంలో 54వ డివిజ‌న్‌కు చెందిన శ్యామ్, సతీష్, రాము, రాజ్ కుమార్, మనోహర్, వెంకన్న, పవన్, విక్రమ్, రాజు, వంశీ, అభిషేక్, కాలని వాసులు రాజారాం, సుధాక‌ర్‌రావు, అంజయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సతీష్, కుమారస్వామి, మోహన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News