అనారోగ్యంతో తల్లి మృతి.. కొన్ని గంటలకే..

తల్లి మరణాన్ని తట్టుకోలేక.. ఆమె మరణించిన కొన్ని గంటలకే కొడుకు కూడా మరణించాడు. ఈ విషాద ఘటన హనుమకొండలో జరిగింది.

Update: 2024-10-09 10:03 GMT

దిశ, వెబ్ డెస్క్: కొన్ని బంధాలు చావులో కూడా కలిసే ఉంటాయి. ఆత్మీయులను కోల్పోయామన్న బాధతో.. కొందరు బలవన్మరణాలకు పాల్పడితే.. మరికొందరు ఆ బాధను తట్టుకోలేక మరణిస్తున్నారు. తల్లి- పిల్లలు, భార్య-భర్త.. ఇలాంటి బంధాలు కడదాకా కాదు.. చితిలో కూడా తోడుగా వస్తానంటాయి. తల్లి మరణించిందన్న బాధను తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే కొడుకు కూడా మరణించాడు. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరిగింది.

తల్లి శోభ (60) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూయగా.. ఆ బాధను భరించలేక కొడుకు కొన్ని గంటల్లోనే మరణించాడు. ఒకేరోజు తల్లి, కొడుకు ఇలా చనిపోవడం స్థానికులను కలచివేసింది. ఇద్దరి మృతితో ఆ ఇల్లు శోకసంద్రమైంది. తల్లి, కొడుకు ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ కుటుంబం కన్నీరు పెడుతుంటే.. చూసిన వారికి గుండె చలించిపోయింది. 

Similar News